రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

72చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం. నాగర్ కర్నూల్ జిల్లా కొట్ర గ్రామానికి చెందిన మహేష్ యాదవ్ (34) వెల్దండ నుంచి కొట్ర గ్రామానికి కారులో వెళుతుండగా. గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్