ప్రజలు మెచ్చే విధంగా, పారదర్శకమైన ప్రజాపాలన అందించేందుకు అధికారులు తమవంతు సహకారం అందించాలని కొల్లాపూర్ ఎమ్మెల్యే, మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై మంగళవారం వనపర్తి జిల్లా ఐడిఓసి సమావేశ మందిరంలో సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ. ప్రభుత్వం ప్రజలు మెచ్చే విధంగా పారదర్శకమైన ప్రజాపాలన అందించేందుకు కృతనిశ్చయంతో ఉందని అందుకు ఆయా శాఖల అధికారులు పూర్తి సహకారం అందించాలన్నారు.