అవినీతి లేని పాలన బీజేపీతోనే సాధ్యం

79చూసినవారు
అవినీతి లేని పాలన బీజేపీతోనే సాధ్యం
దేశంలో అవినీతి రహిత పాలన కేవలం బీజేపీ పార్టీకి మాత్రమే సాధ్యమని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతి రెడ్డి అన్నారు. సోమవారం మరికల్ మండలం చిత్తనూర్ గ్రామంలో ఎంపీ అభ్యర్థి డీకే అరుణ కు మద్దత్తుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసిందని, మరుగుదొడ్లు, స్మశాన వాటికలు, సిసి రోడ్లకు లక్షల రూపాయలు ఇచ్చిందని అన్నారు. బీజేపీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు.

సంబంధిత పోస్ట్