నెన్నెల మండల కేంద్రానికి చెందిన జంబి మారయ్య (29) అనే యువకుడు సోమవారం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై శ్యామ్ పటేల్ తెలిపారు. మారయ్య కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడని చెప్పారు. తాగిన మైకంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇనుప తీగతో దూలానికి ఉరి వేసుకున్నాడని పేర్కొన్నారు. చుట్టుపక్కల వారు గమనించి కుటుంబీకులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చేసరికి మృతి చెంది ఉన్నాడని చెప్పారు.