గ్రంథాలయంలో పారిశుద్ధ పనులు

63చూసినవారు
బెల్లంపల్లి గ్రంథాలయంలో సోమవారం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహించారు. గ్రంధాలయం ఆవరణలో పిచ్చి మొక్కలు పెరగడంతో పోటీ పరీక్ష అభ్యర్థులు శ్రమదానం చేశారు. దీంతో స్పందించిన మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి పారిశుద్ధ పనులకు శ్రీకారం చుట్టారు. జవాన్ రామస్వామి ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులు పిచ్చి మొక్కలను తొలగించారు. మరో మూడు రోజులపాటు పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్