మంచిర్యాల జిల్లాలో గురువారం రంజాన్ పర్వదినం వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో మసీదులు, ఈద్గాల్లో ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. దీంతో మసీదులు, ఈద్గాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పలువురు ప్రజాప్రతినిధులు, ముస్లిం సోదరులను కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.