ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

78చూసినవారు
ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాముని చెరువు కట్ట వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రీడింగ్ రూమ్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు వాకర్స్ మాట్లాడుతూ సమాజంలో కుల వివక్ష, అంటరానితనంపై ప్రజలను చైతన్యం చేసిన జ్యోతిబాపూలే కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలని కోరారు.

సంబంధిత పోస్ట్