ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని కోర్టు జులై 15 వరకు పొడిగించింది. విచారణ సందర్భంగా సిసోడియా తరపు న్యాయవాది మాట్లాడుతూ.. సీబీఐ కేసు దర్యాప్తును పూర్తి చేసిందని అన్నారు. కానీ, తమ సౌలభ్యం కోసం సీబీఐ తప్పుడు ప్రకటనలు ఇస్తోందని ఆరోపించారు. మరోవైపు, ఎమ్మెల్యే నిధుల నుంచి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పత్రాలపై సంతకం చేసేందుకు సిసోడియాకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది.