SLBC ప్రమాద స్థలాన్ని శనివారం తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. 'టన్నెల్ వద్దకు మళ్లీ 2, 3 రోజుల్లో వస్తాను. అప్పుడు మా ప్రొగ్రెస్ గురించి చెప్తాను. ఈ నెల 11న సీఎం స్థాయిలో సమీక్ష నిర్వహిస్తాం. అయితే సహాయక చర్యలు చేసే టీమ్కి కూడా లోపలికి వెళ్తే లైఫ్ రిస్క్ ఉంది. అందుకని కేరళ నుండి కడవల్ డాగ్స్ తెచ్చాం, రేపు రోబోలను కూడా తెప్పిస్తాం' అని అన్నారు.