ఐపీఎల్ 2025లో భాగంగా విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో ఢిల్లీ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఐదు వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నారు. ఐపీఎల్ 2025లో రెండు మ్యాచ్లు ఆడిన మిచెల్ స్టార్క్ మొత్తం ఎనిమిది వికెట్లు తీశారు. పర్పుల్ క్యాప్ రేసులో రెండో స్థానంలో 7 వికెట్లతో CSKబౌలర్ నూర్ అహ్మద్ ఉన్నారు.