భారత్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలపై పాకిస్థాన్ పత్రిక డాన్ స్పందించింది. లోక్సభ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ప్రాంతీయ పార్టీలతో కలిసి నడవాల్సి ఉంటుందని పేర్కొంది. లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ మార్కును దాటలేక పోయినప్పటికీ మూడోసారి అధికారంలో కొనసాగడానికి మోదీ సిద్ధమయ్యారని జియో టీవీ అభిప్రాయపడింది.