పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య ఇప్పుడు రోజువారి కూలీగా మారారు. తన నెలవారీ గౌరవ వేతనం ఆగిపోయిందని, అందరూ సానుకూలంగా స్పందించినప్పటికీ వారు ఏమీ చేయడం లేదని ఆయన చెప్పారు. మొగులయ్య హైదరాబాద్ సమీపంలోని తుర్కయమంజాల్లోని ఓ నిర్మాణ స్థలంలో (సిమెంట్ వర్కర్) పని చేస్తూ కనిపించారు. అరుదైన సంగీత వాయిద్యమైన 'కిన్నెర'ను తిరిగి ఆవిష్కరించినందుకు దర్శనం మొగులయ్యను 2022లో భారతదేశంలో నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో సత్కరించారు.