
అచ్చంపేట ఎమ్మెల్యే కోలుకోవాలని కాంగ్రెస్ నాయకుల పూజలు
వంగూర్ మండల కేంద్రంలోని ప్రసన్న ఆంజనేయస్వామి దేవాలయంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పూజలు నిర్వహించారు. గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ నాయకులు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో టి. యాదగిరి రావు, యాదయ్య, గడ్డం చంద్రయ్య, బి. అంజయ్య, పాండు, రవి, నరసింహ, నరేందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.