దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కు మంత్రి పదవి ఇవ్వాలని పీఏ పల్లి వైస్ ఎంపీపీ అర్వపల్లి సరిత నర్సింహ ఆదివారం ఒక ప్రకటనలో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి కోరారు. లంబాడ సామాజిక వర్గానికి చెందిన బాలు నాయక్ రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి నల్గొండ జడ్పీ చైర్మన్ గా గెలుపొంది, ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని బలమైన శక్తిగా తయారు చేసిన బాలు నాయక్ కు గిరిజన కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని ప్రకటనలో పేర్కొన్నారు.