మిషన్ భగీరథ పథకం కింద బిగించిన నల్లాల ఆన్లైన్ ప్రక్రియ వేగవంతం చేయాలని మిర్యాలగూడ ఎంపీడివో శేషగిరి శర్మ ఆదేశించారు. శుక్రవారం మండలంలోని అవంతిపురం సహా పలు గ్రామాల్లో మిషన్ భగీరథ ఇంటింటి ఆన్లైన్ ప్రక్రియను ఎంపీఓ తో కలిసి పరిశీలించారు. అవంతిపురం పంచాయతీ కార్యదర్శి గాయత్రి రెడ్డి మిషన్ భగీరథ ఇంటింటి ఆన్లైన్ ప్రక్రియ సకాలంలో పూర్తి చేసినందుకు సంతృప్తి వ్యక్తం చేసి అభినందించారు.