రైస్ మిల్లుల్లో కాలుష్య నియంత్రణ అధికారుల తనిఖీ

54చూసినవారు
రైస్ మిల్లుల్లో కాలుష్య నియంత్రణ అధికారుల తనిఖీ
మిర్యాలగూడ మండలంలోని యాద్గార్పల్లి గ్రామంలోని పలు రైస్ మిల్లుల్లో శుక్రవారం పొల్యూషన్బోర్డు అధికారులు తనిఖీలు చేశారు. రైస్ మిల్లుల నుంచి వస్తున్న బూడిదతో పాటు నీటికాలుష్యం వల్ల గ్రామస్తులు అనారోగ్యానికి గురవుతున్నట్లు సైదులు ఎన్హెచ్ఎర్సీలో ఫిర్యాదు చేశాడు. కమీషన్ ఆదేశాల మేరకు అధికారులు పలు రైస్ మిల్లుల్లో తనిఖీలుచేశారు. ఎన్హెచ్ఆర్సీకి నివేదిక అందించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్