క్రికెట్ క్రీడాకారులు క్రీడ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదగాలని బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మాలోత్ దశరథ్ నాయక్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ దనవత్ తిరుపతి నాయక్ లు కోరారు. మిర్యాలగూడ మండలం జంకుతండ గ్రామంలో భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసి మాట్లాడారు.