నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో గురువారం కాంగ్రెస్ సర్కార్ రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ మాజీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహ రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని రైతాంగాన్ని మోసం చేసి రైతుల ఆత్మహత్యల తెలంగాణగా మార్చాలని చూస్తున్నారని అన్నారు.