గడ్డి మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

79చూసినవారు
గడ్డి మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
నిడమనూరు మండలం వేంపాడు గ్రామానికి చెందిన బోయిన శివ(30) పామాయిల్ తోటలో కూలి పని చేస్తూ జీవిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మద్యానికి బానిస అయ్యాడు. ఈ క్రమంలో భార్యతో తరచు గొడవలు జరగడంతో భార్య పుట్టింటికి వెళ్ళింది. మనస్తాపానికి గురైన శివ సోమవారం గడ్డి మందు తాగాడు. పరిస్థితి విషమించడంతో మిర్యాలగూడలో ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడి నుండి నల్గొండకు తరలించారు. చికిత్స పొందుతు మంగళవారం మృతి చెందాడని బుధవారం భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్