స్మశానవాటికలో కంప చెట్లు తొలగించాలి: ఎంపీడీఓ

55చూసినవారు
స్మశానవాటికలో కంప చెట్లు తొలగించాలి: ఎంపీడీఓ
పెద్దవూర మండలంలోని అన్ని గ్రామపంచాయతీలలో ఉన్న స్మశానవాటికల్లో పిచ్చి మొక్కలు, కంప చెట్లు తొలగించి నీడనిచ్చే మొక్కలు నాటాలని ఎంపీడీఓ ఉమాదేవీ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలమేర మండలం కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పారిశుధ్యలోపం కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలేందుకు అవకాశం ఉందని.. డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలు సోకేందుకు ఆస్కారం ఉందని ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్