శ్రీలంక దక్షిణ కొలంబోలోని పాణదుర ప్రాంతంలో కోతి చేసిన పనికి దేశం మొత్తం కరెంట్ కట్ అయింది. వివరాల్లోకి వెళ్లితే.. ఓ కోతి ఆదివారం విద్యుత్ గ్రిడ్ సబ్ స్టేషన్లో ముఖ్యమైన వ్యవస్థలను లాగిపారేయడంతో ఒక్కసారిగా విద్యుత్ వ్యవస్థ ఆగిపోయింది. దీంతో దేశం మొత్తం కరెంట్ కట్ అయింది. దీంతో 5 గంటల పాటు అన్ని సేవలు ఆగిపోయాయి. తీరా విషయం తెలిశాక మరమ్మతులు చేయడానికి 5 గంటల సమయం పట్టిందని అధికారులు తెలిపారు.