'ఛావా'కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అంటూ వచ్చిన వార్తలు చూసి తాను షాకయ్యానని నిర్మాత బన్నీ వాసు పేర్కొన్నారు. ఎన్టీఆర్ను తాము సంప్రదించలేదని తెలిపారు. తాము వారం క్రితమే ఛావా సినిమా రిలీజ్ హక్కులు సొంతం చేసుకున్నారు. ఇంత తక్కువ సమయంలో స్టార్స్ను ఇబ్బంది పెట్టాలని ఎవరూ అనుకోరని వివరించారు. అందుకే డబ్బింగ్లో నిపుణులైన వ్యక్తులతో తెలుగులో డబ్ చెప్పించామని బన్నీ వాసు వెల్లడించారు.