వడదెబ్బతో వ్యక్తి మృతి
వడదెబ్బతో వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన ఆదివారం భైంసా పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం కొర్భ గల్లీకి చెందిన బయోళ్ల చిన్న పోశెట్టి(52) అనే వ్యక్తి కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఉదయాన్నే ఉన్నట్టుండి కుప్పకూలి పోయాడు. నిరుపేద బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గల్లీ వాసులు కోరుతున్నారు.