ఖానాపూర్ పట్టణ శివారులోని రెంకోన వాగు వంతెన వద్ద మరమ్మతు చేసిన అప్రోచ్ రోడ్డు మళ్లీ కోతకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. ఖానాపూర్ మండలంలో శనివారం భారీ వర్షం పడింది. దీంతో ఖానాపూర్-దిల్వార్పూర్ మధ్యలో ఉన్న రెంకోన వాగుపై నిర్మించిన వంతెన దగ్గర వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో అప్రోచ్ రోడ్డు మరోసారి కోతకు గురయ్యే అవకాశం ఉందని, వాహనదారులు ప్రజలు అప్రమత్తంగా వెళ్లాలని వారు కోరారు.