మొక్కలను కాపాడుకుందాం: ఎంపీడీవో

78చూసినవారు
మొక్కలను కాపాడుకుందాం: ఎంపీడీవో
పర్యావరణాన్ని కాపాడేవి మొక్కలేనని దస్తురాబాద్ మండల ఎంపీడీవో రమేష్ అన్నారు. గురువారం మధ్యాహ్నం దస్తురాబాద్ మండలంలోని బూత్కూరు గ్రామంలో అధికారులు, పాఠశాల విద్యార్థులతో కలిసి నాటుదాం ఒక మొక్క అమ్మ పేరు మీద కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. భావితరాల భవిష్యత్తు కోసం, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రమేష్ రెడ్డి, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్