ఆదివాసుల సమస్యలను పరిష్కరించాలి

70చూసినవారు
ఆదివాసుల సమస్యలను పరిష్కరించాలి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఆదివాసుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఉట్నూర్ ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తాను కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు నాయకురాలు ఆత్రం సుగుణ కోరారు. గురువారం ఐటీడీఏ కార్యాలయంలో పిఓ ను కలిసి ఆదివాసి సమస్యలపై విన్నవించారు. పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరారు. వర్షాకాలంలో ఏజెన్సీ ప్రాంతంలో ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రాజెక్ట్ అధికారిని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్