అక్రమ తవ్వకాలపై స్పందించిన అధికారులు

61చూసినవారు
అక్రమ తవ్వకాలపై స్పందించిన అధికారులు
ముథోల్ మండలం చించాల కొత్తచెరువు కొలతలను శనివారం రెవెన్యూ-ఇరిగేషన్ అధికారులు తీసుకున్నారు. అనుమతి లేకుండా రాత్రి సమయంలో జెసిబి సాయంతో అక్రమ తవ్వకాలు చేపడుతున్న విషయాన్ని తహసిల్దార్ తో పాటు ఎంపీడీవోకు గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. దీంతో స్పందించిన అధికారులు కొత్త చెరువులో కొలతలను తీసుకొని ఉన్నతాధికారులకు నివేదికను అందిస్తామని వెల్లడించారు. అనుమతి లేకుండా తవ్వకాలు చేపడితే చర్యలు తప్పవన్నారు.

సంబంధిత పోస్ట్