ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు

66చూసినవారు
ముధోల్ మండలంలో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షానికి ఆదివారం ముధోల్ మండల కేంద్రంలోని సాయి మాధవ్ నగర్ కాలనీలోని పలు ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. దీంతో కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనిలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా ఇక పోవడంతో నీరు బయటకు వెళ్లే అవకాశం లేక ఇళ్లలోకి నీరు చేరుతుందని కాలనీ వాసులు వాపోయారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్