పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం రానున్నారు. స్థానిక కలెక్టరేట్ రోడ్డు క్రిషర్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాటును ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క శనివారం పరిశీలించారు. ఆదివారం ఉదయం 11 గంటలకు బహిరంగ సభకు రాహుల్ గాంధీ నాందేడ్ నుండి రానున్నారని, సభకు 65 వేల జనసమీకరణ చేస్తున్నట్టు తెలిపారు.