మచ్చర్ల ప్రాథమిక పాఠశాలలో కృత్రిమ మేధస్సు ద్వారా కంప్యూటర్ విద్యను ఆలూరు మండల విద్యా శాఖాధికారి ఎం నరేందర్ శనివారం ప్రారంభించారు. కృత్రిమ మేధస్సు సహకారంతో విద్యార్థులు సులభంగా నేర్చుకొని చదువులో రాణిస్తారని ఆలూర్ ఎంఈఓ యం. నరేందర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాచర్ల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పండరి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజసులోచన, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.