సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి వేడుకలను నందిపేట్ మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో
ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఎస్. రాజ్ కుమార్, ఎన్ఎస్ఎస్-పీఓ లక్ష్మణ్ శాస్త్రి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతులు కిషోర్, లావణ్య, అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.