ఎల్ఓసి అందజేసిన పొద్దుటూరు వినయ్ రెడ్డి

65చూసినవారు
ఎల్ఓసి అందజేసిన పొద్దుటూరు వినయ్ రెడ్డి
ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని మామిడిపల్లి 7వ వార్డుకు చెందిన గంగామణి అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఆమె ఆరోగ్య రీత్యా ఆర్థిక సాయం కోసం ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డిని కుటుంబ సభ్యులు సంప్రదించారు. స్పందించిన ఆయన సీఎం సహాయ నిధి నుండి 2. 5 లక్షల రూపాయల ఎల్ఓసిని మంగళవారం బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు.

సంబంధిత పోస్ట్