తడిసిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి

573చూసినవారు
నందిపేట మండలం వెల్మల్ గ్రామంలో గత రెండు రోజుల నుంచి అకాల వర్షాలతో నష్టపోయిన వరి కొనుగోలు కేంద్రాలను నిజామాబాద్ జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా పార్లమెంట్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుమయానికి తూకం వేయకపోవడం వల్ల అకాల వర్షాలతో రైతాంగం నష్టపోసిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. తడిసిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అధికారులను కోరారు.

సంబంధిత పోస్ట్