నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో గురువారం అధికారులతో సమావేశం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఆయా పరీక్షలను జిల్లాలో ప్రశాంత వాతావరణంలో సాఫీగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ శ్రీనివాస్, పవన్ పాల్గొన్నారు.