AP: పలు విభాగాల్లో రిటైర్డ్ ఉద్యోగుల సేవలను కొనసాగిస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. అలాంటి సిబ్బందిని వెంటనే తొలగించాలని సీఎస్ నీరభ్ కుమార్ అన్ని శాఖల HODలు, ప్రభుత్వ కార్యదర్శులు, సెక్రటరీలను ఆదేశించారు. తొలగింపులపై ఈ నెల 24లోగా నివేదిక ఇవ్వాలన్నారు. ఎవరైనా రిటైర్డ్ ఉద్యోగుల సేవలు ఆ శాఖలో తప్పనిసరైతే నిబంధనలను అనుసరించి కొత్తగా ఉత్తర్వులు ఇవ్వాలని సూచించారు.