ఆర్మూర్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో రాజా గౌడ్ శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ బి ఎల్ ఓ లు ప్రతి ఇంటింటికి వెళ్లి ఇంట్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారో తెలుసుకోవాలని అన్నారు. ఓటర్లకు సంబంధించిన పేర్లు మార్పులు చేర్పులు సంబంధించిన వివరాలు నమోదు చేయాలని ఆర్డీవో సూచించారు.