లోక్సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్ల విజయాల సంఖ్య తగ్గిపోతోంది. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఏడుగురు మాత్రమే గెలిచారు. మొత్తం 3,195 మంది పోటీ చేయగా బారాముల్లా నుంచి అబ్దుల్ రషీద్ షేక్ అత్యధికంగా 2 లక్షల మెజార్టీతో విజయం సాధించారు. డమన్ డయ్యూ నుంచి పటేల్ ఉమేశ్ బాయ్ అత్యల్పంగా 6,225 ఓట్ల మెజార్టీతో పార్లమెంట్లో అడుగుపెట్టబోతున్నారు.