మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లాలో ఘోర సంఘటన జరిగింది. ఓ రైల్వే ఉద్యోగి కుటుంబం రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సిహోడా గ్రామానికి చెందిన నరేంద్ర చాదర్ రైల్వే ట్రాక్మెన్గా పని చేస్తున్నాడు. బుధవారం ఉదయం అతడితోపాటు భార్య, ఇద్దరు కుమార్తెల మృతదేహాలను రైలు పట్టాలపై పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు.