AP: ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీ ప్రజాప్రతినిధులతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జగన్ మాట్లాడుతూ.. "గ్రామ స్థాయిలో మన పార్టీ చాలా బలంగా ఉంది. మన పార్టీలో ఇప్పటికే క్రియాశీలక మార్పులకు నాంది పలికాం. సంక్రాంతి తర్వాత ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తా. 'కార్యకర్తలతో జగనన్న-పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం' అనే పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తాం" అని జగన్ పేర్కొన్నారు.