తమిళ ఇండస్ట్రీలో ‘పరాశక్తి’ అనే టైటిల్ వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఒకేరోజు ఇద్దరు హీరోలు శివకార్తికేయన్, విజయ్ ఆంటోని సినిమాలకు ‘పరాశక్తి’ అని ప్రకటించారు. తాజాగా ఈ వివాదం ముగిసినట్లు తెలుస్తుంది. ఈ టైటిల్ను శివ కార్తికేయన్ సినిమాకు ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు విజయ్ ఆంటోని ప్రకటించాడు. తెలుగులో తన సినిమా టైటిల్ను మార్చబోతున్నట్లు తెలిపాడు.