నల్గొండ జిల్లా కనగల్ వద్ద మే 19న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మృతుడు యాదగిరిగుట్టకు చెందిన సముద్రాల కృష్ణగా గుర్తించారు. ఈ హత్య కేసులో నిందితులను ఏడుగురిని అరెస్ట్ చేశారు. రైస్ పుల్లింగ్ యంత్రం ఇప్పిస్తానని ఓ ముఠాతో కృష్ణ ఒప్పందం చేసుకుని.. మధు అనే వ్యక్తి వద్ద రూ.1.50 కోట్లు ఖర్చు పెట్టించాడు కృష్ణ. 6 నెలలు గడిచినా యంత్రం ఇప్పించలేదని కృష్ణను ఆ ముఠా హత్య చేసింది.