పుణేలోని స్వర్గేట్ బస్టాండ్ వద్ద ఓ యువతిపై బస్సులో దత్తాత్రేయ్ రామ్దాస్ అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి 8 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఎక్కడ అచూకీ లభించకపోవడంతో లక్ష రివార్డు కూడా ప్రకటించారు. 75 గంటల గాలింపు చర్యల అనంతరం పోలీసులు అతడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.