శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఖతార్కు చెందిన విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. విమానం దోహ నుంచి బంగ్లాదేశ్ వెళ్తుండగా విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో సదరు మహిళకు చికిత్స కోసం పైలెట్ ఫ్లైట్ను శంషాబాద్లో ల్యాండ్ చేశారు. అయితే ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే ఆ మహిళ మరణించింది.