ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరాన్ ప్రభుత్వం ప్రకటించిన సంతాప కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. హెలికాప్టర్ కుప్పకూలిన ప్రదేశానికి సమీపంలోని తబ్రిజ్ పట్టణంలో మంగళవారం శవపేటికలతో సంతాప యాత్ర జరిగింది. ఈ కార్యక్రమంలో నల్లదుస్తులతో, ఇరాన్ జెండాలు పట్టుకొని వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. గురువారం అంత్యక్రియలు ఘనంగా నిర్వహిస్తారు.