ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు అంతిమ యాత్ర రామోజీ ఫిల్మ్సిటీలోని ఆయన నివాసం నుంచి ప్రారంభమైంది. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజీ ఫిల్మ్సిటీలోని స్మృతివనంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంతిమ సంస్కారాలు వీక్షించేందుకు స్మృతివనంలో ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. అంత్యక్రియలకు ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరుకానున్నారు.