ఇమేజ్ డ్యామేజ్ చేస్తే సహించం: డీజీపీ

67చూసినవారు
ఇమేజ్ డ్యామేజ్ చేస్తే సహించం: డీజీపీ
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, అరెకపూడి గాంధీ మధ్య వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ పరిస్థితి నేపథ్యంలో డీజీపీ జితేందర్ సీరియస్ అయ్యారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌కు నష్టం కలిగిస్తే సహించబోమని, ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని హెచ్చరించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఎలాంటి అల్లర్లకు చోటు లేదని, విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్