చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన ఇందిర(38)కు నాలుగేళ్ల కిందట రామంతాపూర్కు చెందిన ఆనంద్(42)తో వివాహం జరగగా వారికి మూడేళ్ల విక్కీ (3) సంతానం ఉన్నారు. ఇందిర ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా ఆనంద్ కొంతకాలం పాల వ్యాపారం చేసి నష్టపోయి ఆన్లైన్ గేములు ఆడుతూ డబ్బులు పోగొట్టుకునేవాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో కుమారుడికి, భార్యకు కూల్ డ్రింక్లో విషం కలిపి ఇచ్చి తాను ఆత్మహత్య చేసుకున్నాడు.