హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మునగనూర్ లో శుక్రవారం అర్దరాత్రి ద్విచక్ర వాహనాల దొంగలు హల్చల్ చేశారు. బ్యాంక్ కాలనీ, మునగనుర్ లలో ఇళ్ళ ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను దుండగులు ఎత్తు కెళ్లారు. ముందుగా చోరీ చేసిన స్ప్లెండర్ బైక్ లో పెట్రోల్ లేకపోవడంతో కొద్ది దూరం వెళ్లి పడేసి వెళ్ళారు. అక్కడే ఉన్న తుర్కయంజల్ మున్సిపలిటీ మునగానుర్ వార్డు కౌన్సిలర్ మోహన్ కి చెందిన రాయల్ ఎన్ఫిల్డ్ బైక్ చోరీ చేశారు.