రంజాన్ ను పురస్కరించుకొని ఈటల ప్రత్యేక ప్రార్ధనలు

82చూసినవారు
రంజాన్ ను పురస్కరించుకొని ఈటల ప్రత్యేక ప్రార్ధనలు
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే రంజాన్ పండుగ వేడుకలు భాగ్యనగరంలో ఘనంగా జరుగుతున్నాయి. రంజాన్‌ను పురస్కరించుకుని గురువారం హయత్ నగర్ లోని హయత్ బక్షి పెద్ద మసీద్ లో మల్కాజ్గిరి బీజేపీ ఎంపి అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రత్యేక ప్రార్థనలలు చేశారు. ఈటల వెంట రంగా రెడ్డి జిల్లా బీజేపీ అర్బన్ అధ్యక్షుడు సామా రంగా రెడ్డి, కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి, కార్పొరేటర్ లచ్చి రెడ్డి, కళ్లెం రవీందర్ రెడ్డి ఉన్నారు.

సంబంధిత పోస్ట్