మేడ్చల్ జిల్లా టాస్క్ఫోర్స్ ఎక్సైజ్ పోలీసులు మంగళవారం తుంకుంటలో సోదాలు నిర్వహించారు. బీహార్ కు చెందిన ఉపేందర్ మండల్ అనే వ్యక్తి ఇంట్లో 85 ప్యాకెట్ల గంజాయి చాకెట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా ఓ పాన్ షాప్ ఏర్పాటు చేసి విక్రయిస్తున్నట్లు తెలుసుకున్న అధికారులు దాడి చేసి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రూ. 25కు ఒక ప్యాకెట్ కొని ఒక్కొక్కటి రూ. 10 కి విక్రయిస్తున్నట్లు గుర్తించారు.